కుత్బుల్లాపూర్,ఏప్రిల్ 17 2026 : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు చలివేంద్రం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం లక్ష్యంగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయబడిందని జీడిమెట్ల ఎస్హెచ్ఓ శ్రీ గడ్డం మల్లేష్ తెలిపారు,ఆయన రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ,ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అలాగే సైబర్ క్రైమ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని హెచ్చరించారు.ఇక మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యానికి, కుటుంబ వ్యవస్థకు మరియు సమాజానికి కలిగే హానికారక ప్రభావాల గురించి వివరంగా తెలియజేశారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం ద్వారా పోలీసు శాఖ ప్రజలతో మరింత సాన్నిహిత్యం పెంపొందించుకోవడంతో పాటు సమాజంలో అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించింది.

జీడిమెట్ల పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

మహిళలు అన్నిరంగాలలో రాణించాలి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు

 

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 17 2026 : మేడ్చల్ జాతీయ రహదారి పై పిల్లర్ నంబర్ 03 వద్ద వేగంగా వస్తున్న ts08ue6386 నంబరు గల మినీ ట్రక్ అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా కొట్టింది.స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్ .దింతో ఉదయం రద్దీ సమయం కావడం తో కోడి సేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు స్పందించి రోడ్డు అడ్డుగా పడిన మినీ ట్రుకక్కును తొలగించారు.వాహనదారులు వేగాన్ని తగ్గించి సమయస్ఫూర్తితో వాహనాలను నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాల బారి నుండి బయటపడే అవకాశం ఉంటుందని పోలీసులు డ్రైవర్ కు సూచించారు.

మేడ్చల్ జాతీయ రహదారి పై మినీ ట్రక్కు బోల్తా

స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్

99 రోజుల ప్రజా పాలన పేరిట ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు - సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 17 2026 : రేవంత్ రెడ్డి ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన పేరిట ప్రజలకు ఇబ్బంది కలిగించే ఆక్రమణలు తొలగిస్తున్నామనే పేరుతో వీధి వ్యాపారులను తొలగించడం అన్యాయమని వెంటనే అటువంటి నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని అన్నారు.గాంధీనగర్ పారిశ్రామిక వాడలో గత 30 సంవత్సరాలుగా రోడ్డు కు 10 ఫీట్ల దూరంలో చిన్న డబ్బాలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పేద వాళ్లను తొలగిస్తామంటే వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను రోడ్డున పాలు చేయడమేనని అలాంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని కావున ట్రాఫిక్ మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించని విధి వ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ లోని ఇండస్ట్రియల్ కార్యాలయంలో మేనేజర్ శ్రీవాణి ని కలిసి వినతి పత్రం ఇచ్చారు.ఈ ప్రాంతంలో వీధి వ్యాపారం చేసుకునే వారికి ప్రభుత్వం గుర్తింపు కార్డులను ఇచ్చిందని అలాగే లోన్లు కూడా ఇచ్చిందని ఈ విధంగా వీధి వ్యాపారులు ప్రభుత్వం చే గుర్తింపబడ్డ వాళ్ళు కాబట్టి వారిని తొలగించడం అన్యాయమని వీధి వ్యాపారులకు వర్తించే చట్టాలు అమలు చేసి వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు.డబ్బులు చెల్లించి కిరాయిలు తీసుకునే పరిస్థితి లేనందు వల్లే వారు రోడ్డుపై వ్యాపారం చేస్తున్నారని ప్రభుత్వం పైన ఆధారపడకుండా సొంతంగా జీవనోపాధిని కల్పించుకుంటున్నారని అలాంటి వారి పైన మానవతా దృక్పథంతో పనిచేయాలని వారికి అన్యాయం చేయొద్దని,వాళ్ల తరపున పోరాడటానికి సిపిఐ మరియు ఏఐటీయూసీ నాయకత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ ఏఐటీయూసీ అనుబంధ విధి వ్యాపారుల సంఘం అధ్యక్షులు జావిద్,కార్యదర్శి యాదగిరి,సంఘం నాయకులు చాంద్,ఖాన్,జుబేర్,ఆదిల్,మహేష్, రవీందర్ సింగ్,శ్రీ పత్,ముస్తఫా లతో పాటు వీధి వ్యాపారులు పాల్గొనడం జరిగింది.

రాజ్యసభ సభ్యులు వెం నరేందర్ రెడ్డికి ఢిల్లీలో శుభాకాంక్షలు తెలిపిన శ్రీశైలం గౌడ్

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 17 2026 : తెలంగాణ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి ఢిల్లీలో జరిగిన వారి ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ పార్లమెంట్ ఆవరణలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన కాంగ్రెస్ నాయకులు వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు.అనంతరం రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి రాజ్యసభలో తెలంగాణ వానిని మరింత బలంగా వినిపించి తెలంగాణ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం మరింత ఉండాలని కోరారుఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మరియు హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకుడు బొమ్మ శ్రీరాం గారు తదితరులు పాల్గొన్నారు.

జలమండలి అధికారులతో జలమండలి అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 17 2026 : పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని డివిజన్లో, బస్తీలలో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ, త్రాగునీటి పైప్ లైన్ కనెక్షన్ల నిర్మాణము, పైప్ లైన్ మరమ్మతు పనులపై బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు జలమండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సుమారు 2.04 కోట్ల రూపాయలతో నూతనంగా చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా పైప్లైన్ పనులను త్వరగా ప్రారంభించి, పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోని కాలనీలు, బస్తీలలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఇప్పటికే చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, రోజురోజుకు పెరుగుతున్న జనాభా వెలుస్తున్న కాలనీలలో భూగర్భ డ్రైనేజీ, త్రాగునీటి సరఫరా పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు ప్రణాళికలు రచించి నూతన పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే దిశగా ప్రజల అవసరాలకు అనుగుణంగా అవసరమైన చోట రిజర్వాయర్లను నిర్మించి భవిష్యత్తు అవసరాలకు సరిపోయే విధంగా త్రాగునీటిని అందించే వైపుగా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నేటి ఎద్దడి కలగకుండా అధికారులు ప్రజలకు నీటిని సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో జిఎంలు మాధవి, పరిమళ, వివిధ సెక్షన్ల డీజీఎంలు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

కుత్బుల్లాపూర్,ఏప్రిల్ 17 2026 : గురువారం బాలానగర్ డివిజన్ పరిధిలోని రాజు కాలనీలోని కమ్యూనిటీ హాల్లో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవారంక్రిష్ణ రావు.శిక్షణ అందిస్తున్న ఖార్డు సంస్థ అధినేత సుమన్ మల్లాది దంపతులును అభినందించారు.మహిళలు శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధి సాధించి ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ దేశానికి మంచి పేరు తీసుకురావడమే కాకుండా ప్రపంచ స్థాయిలో తమ సత్తా చాటుతున్నారని కొనియాడారు.శిక్షణ పూర్తి చేసుకున్నానంతరం ప్రశంసా పత్రంతో పాటు ఉచితంగా కుట్టు మిషన్ కూడా అందిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు తెలిపారు.అనంతరం చరబండ రాజు నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కార్డు సంస్థ వారు ఏర్పాటు చేసిన సైన్స్ లాబ్ ను ప్రారంభించారు.మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలతో పాటు పెద్దలు కూడా టెక్నాలజీ తెలుసుకుంటూ ముందుకు వెళ్లాలని.నేడు విద్యార్థులను కూడా తల్లిదండ్రులు శాస్త్ర సాంకేతిక రంగం.క్రీడల్లో పిల్లలకు ఎలాంటి నైపుణ్యం ఉందో గుర్తించి అందులోనే వారిని ప్రోత్సహిస్తే దేశానికే కాక ప్రపంచానికే వెన్నుముకగా నిలుస్తారని అనడంలో సందేహం లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,కార్డ్ సంస్థ వ్యవస్థాపకులు సుమన్ మల్లాది,మదులత మల్లాది,సంస్థ సభ్యులు లక్ష్మణ్,ఖాజా, మహిళలు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రోత్సహించండి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు

సైన్స్ ల్యాబ్ లో విద్యార్థుల ప్రతిభను అభినందించిన ఎమ్మెల్యే

మానవసేవే మాధవ సేవ బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్,ఏప్రిల్ 17 2026 : జీడిమెట్ల 132 డివిజన్ సుచిత్ర చౌరస్తా లో బిఆర్ఎస్ నాయకులు జలిగం రాకేష్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద,ఏసీపీ వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయి చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు – ప్రజల దాహార్తిని తీర్చేందుకు తోడ్పాటని,చలివేంద్రాల ద్వారా ప్రజలకు సేవచేయడం ఆ దైవానికి సేవ చేసినట్టేనని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జీడిమెట్ల డివిజన్ సమన్వయ కమిటీ సభ్యులు, కుత్బుల్లాపూర్ డివిజన్ నాయకులు నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చిరు వ్యాపారులను రోడ్డున పడేయడం ఏంటని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాధవరం

చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపకపోతే జీహెచ్ఎంసి కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తా

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 17 2026 : బతుకు జీవుడా అంటూ పొట్ట చేత పట్టుకుని నగరానికి వచ్చిన నిరుపేదలపై రేవంత్ రెడ్డి సర్కారు పగ పట్టినట్టు వ్యవహరిస్తోందని.. కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్, బోరబండ, కేపిహెచ్ బి డివిజన్లో ప్రభుత్వ అధికారులు రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే నిరుపేదలపై తమ ప్రతాపం చూపడం ఎంతో బాధ కలిగిస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.గురువారం ఆయన కేపిహెచ్బి డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల ఫుట్పాత్ లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులను తొలగించడం ఏంటని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు.నగరంలో చాయి బండి, పళ్ళు, పువ్వులు, భోజనాలు అమ్ముకునేవాళ్లు ఉన్నారు అని వాళ్ళ బతుకుదెరువు అదేనని.కనీసం మానవత్వం లేకుండా ప్రత్యామ్నాయం చూపకుండా అర్ధాంతరంగా వారిని నడిరోడ్డుపై కట్టుబట్టలతో రోడ్డున పడేయడం వల్ల వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని.పేదల పై జిహెచ్ఎంసి ఇదే వైఖరి కొనసాగిస్తే.జిహెచ్ఎంసి కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తానని ఎట్టి పరిస్థితుల్లో నిరుపేదలను కాపాడాలని.వారికి అండగా నేనుంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చిరు వ్యాపారులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 20 దరువు జాతరను విజయవంతం చేయండి : మంత్రి జూపల్లి కృష్ణారావు

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 17 2026 : దరువు తెలంగాణ సాంస్కృతిక చైతన్య వేదిక ఏర్పడి నేటికీ 25 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఈనెల 20 తారీఖున రవీంద్రబారతి లో జరిగే దరువు జాతరను వేలాదిగా కళాకారులు తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా టూరిజం మరియు భాషా సాంస్కృతిక శాఖ ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో దరువు కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దరువు వ్యవస్థాపకులు దరువు ఎల్లన్న దరువు రాష్ట్ర అధ్యక్షులు దరువు అంజన్న సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు కాజా పాషా తదితరులు పాల్గొన్నారు.

శ్రీ సీతారామచంద్ర స్వామికి దేవాలయానికి శ్రీ సీతారామచంద్ర స్వామికి దేవాలయానికి చెక్కుల వితరణ

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 17 2026 : శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీ ఆంజనేయస్వామి గరుత్మంతుడు వార్ల విగ్రహాల కొరకై కూకట్పల్లి వాస్తవ్యులు అందించారు.సిహెచ్.కళ్యాణ్ చక్రవర్తి కల్పన దంపతులు 211116/(రెండులక్ష పది వేల116రూపాయలు)ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కు చెక్కును అందించారు.అలాగే మాధవరం జగదీశ్వర్ రావు దంపతులు 200000/(రెండులక్ష రూపాయలు)ఈరోజు ఎన్.శ్రీనివాసరావు చిన్న (తులసి) కి చెక్కును అందజేశారు.జరగబోయే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం లో కూకట్పల్లి గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.

విద్యార్థుల విజయోత్సవానికి వేదికైన బాలానగర్ పోలీస్ స్టేషన్

ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలి బాలానగర్ సిఐ నరసింహ రాజు

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 17 2026 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ పోలీసులు ఘనంగా సన్మానించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలానగర్ సీఐ నర్సింహరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జి. లక్ష్మి నిత్యానంద్ గౌడ్,బి. ఎస్. సాత్విక్ ఒమేరా మెహ్రీన్, పూజిత,షైక్ సానియా సభహ్,ఎమ్. అక్షర లను శాలువాలతో సత్కరించి,మొమెంటో అందజేసి,వారి భవిష్యత్ అవసరాల కోసం నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సిఐ నర్సింహా రాజు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవడం ద్వారా సమాజంలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.అనంతరం ఎస్ఐ సరిత రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు,ఆకర్షణలకు లోనుకాకుండా కేవలం భవిష్యత్తుపైనే దృష్టి సారించాలని కోరారు."పూర్వం చదువుకోవడానికి సరైన వసతులు ఉండేవి కావు.కానీ నేడు పరిస్థితులు మారాయి.తమకు తిండి లేకపోయినా పర్వాలేదు కానీ,పిల్లలకు నాణ్యమైన చదువు అందాలని తల్లిదండ్రులు తపన పడుతున్నారు.వారి కష్టాన్ని వృధా చేయకుండా ప్రభుత్వ,కార్పొరేట్ రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించాలి"అని హితవు పలికారు.పోలీస్ శాఖ తరపున జరిగిన ఈ అభినందన కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.ఈ కార్యక్రమంలో డిఐ సక్రమ్,ఎస్ఐలు సరిత రెడ్డి,హాజీ మియా,వినోద్ కుమార్,ఏఎస్ఐ హనుమయ్య పలువురు పోలీస్ సిబ్బంది,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కైతలాపూర్ డంపింగ్ యార్డులో గుర్తు తెలియని మృతదేహం

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 17 2026 : కైతలాపూర్ దంపింగ్ యార్డ్ చెత్త కుప్పలో బుధవారం సాయంత్రం 45-50 వయసు కలిగిన గుర్తు తెలియని మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. నరసింహా అనే వ్యక్తి డయల్ 100 కు సమాచారం ఇవ్వడంతో కూకట్ పల్లి పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ మూడు బైకులు స్వాధీనం

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 17 2026 : కూకట్పల్లి ప్రాంతంలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కూకట్పల్లి పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ విజయాన్ని సాధించారు.కూకట్పల్లి సీఐ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం, నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి గ్రామానికి చెందిన రుదావత్ వైజయంతి అలియాస్ వరుణ్ (21) ప్రస్తుతం జగద్గిరిగుట్టలో నివసిస్తున్నాడు. పగలు కూలీ పనులు చేస్తూ, రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఇటీవల ఆల్విన్ కాలనీ పాపయ్య నగర్‌లో పార్క్ చేసిన యాక్టీవా వాహనాన్ని అపహరించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కూకట్పల్లి క్రైమ్ టీమ్ చాకచక్యంగా విచారణ జరిపి నిందితుడిని పట్టుకుంది.నిందితుడి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Contact:

todaytimesnews1@gmail.com

+91 9700597750

© 2026 All rights reserved - todaytimesnews.in

TodayTimesnews.in